సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి గురువారం విస్తృతంగా పర్యటించారు. ఇటీవల అభివృద్ధి చేసిన మొజం జాహీ మార్కెట్ తరహాలో మొండా మార్కెట్ను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. మార్కెట్ అభివృద్ధి కి చేపట్టవలసిన చర్యలు, మార్కెట్ కు ఉన్న ప్రాధాన్యత, చరిత్రను మంత్రి వివరించారు. వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈ మార్కెట్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా పాత ఓల్డ్ జైల్ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టి లెవెల్ పార్కింగ్ ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.