Friday, April 26, 2024
Friday, April 26, 2024

యువతి కిడ్నాప్‌.. మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తోన్న పోలీసులు

ఓ యువతి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్‌ కి గురయింది. కాగా ఈ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కిడ్నాప్‌ చేసిన జాన్‌ అనే వ్యక్తి శాలిని పెళ్లి చేసుకోగా అప్పటికి యువతి మైనర్‌ కావడంతో తల్లిదండ్రులు..కేసు పెట్టారు. అయితే, పది నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన జాన్‌.. యువతిని కిడ్నాప్‌ చేశాడు. ఇక నిన్న వేరే యువకుడితో శాలినికి నిశ్చితార్థం కావడంతో తెల్లవారు జామున జాన్‌ తన స్నేహితులతో కలిసి వచ్చి కిడ్నప్‌ చేసినట్లు గుర్తించారు వేములవాడ పోలీసులు. ఇక కిడ్నాప్‌ అయిన యువతి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img