Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్‌ఎస్‌ నిరసనలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రంపై కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆ పార్టీ ఎంపీలు దిల్లీ చేరుకోనున్నారు. విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండిరగ్‌ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్‌ తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img