Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర

కేంద్రంపై పోరాడటానికి దళితులు సిద్ధం కావాలి : మంత్రి ఎర్రబెల్లి
రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌లో దళిత నేత దివంగత బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.రిజర్వేషన్లు ఎత్తివేసేందుకే కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేస్తుందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రం ఆమోదం తెలిపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అధికార దాహంతో బీజేపీ మతం పేరిట ప్రజల్లో చిచ్చు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి అదుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు.దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయాలను మనం సాధించుకోవాలి. హక్కుల సాధనకు దళిత యువత ఉద్యమించాలి. బొమ్మల కట్టయ్య జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేంద్రంపై పోరాడటానికి దళితులు సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img