Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండో రోజు ఈడీ ముందుకు కిషన్‌ రెడ్డి..

ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి రెండో రోజు కూడా ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. క్యాసినో వ్యవహారంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో మంగళవారం విచారించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా రావాలని నిన్నే ఆదేశించారు. దాంతో ఇవాళ ఉదయం 10:30 గంటలకల్లా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సింగపూర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారనే ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి లావాదేవీలు వెలికితీసిన ఈడీ.. తక్కువ సమయంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లో అతి తక్కువ సమయంలోనే రూ.88 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. అదేవిధంగా ఆయన వాట్సాప్‌ చాట్‌ను రిట్రీవ్‌ చేసిన అధికారులు.. లావాదేవీలపై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ.. ఆయన నుంచి పలు కీలక సమాచారం రాబట్టింది. ఈ క్రమంలో నిన్న సుమారు 8 గంటల పాటు ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డిని విచారించిన ఈడీ మళ్లీ ఇవాళ కూడా ప్రశ్నిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img