Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతుల్ని తప్పుదోవ పట్టించడం సరికాదు


కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు బీజేపీ కానీ, కేంద్రం కానీ భయపడదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీపై సీఎం కేసీఆర్‌ అనేక విమర్శలు చేశారని, భయపెట్టే ప్రయత్నం కూడా చేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌ వాస్తవ విషయాలు చెప్పకుండా రైతుల్ని తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. ఉపఎన్నికలో కూడా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ధాన్యం సేకరణ కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని, రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోందని అన్నారు.014లో కేంద్రం 43 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. ఇప్పుడు 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదని పేర్కొన్నారు. పంజాబ్‌ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. పంజాబ్‌ నుంచి కేంద్రం 135 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోందని, సమస్య మొత్తం దొడ్డు బియ్యం గురించేనన్నారు. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ దొడ్డు బియ్యం పంపించదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, దొడ్డు బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img