మంత్రి గంగుల కమలాకర్
ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, అయితే ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్సీఐ తీరు విచారకరమని అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. . ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు చెల్లింపు అంశాలపైనా చర్చించారు. . గతేడాదికంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామని చెప్పారు. ధాన్యం రైతుల డబ్బు చెల్లింపులకు నిధుల కొరత లేదని తెలిపారు. ఓపీఎంఎస్లో నమోదైన వెంటనే రైతులకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు.ఇప్పటివరకు రూ.5447 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు.