Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ కోసం ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌ నుంచి నడపనున్న ద.మ రైల్వే

ఈనెల 8న హోలీ పండుగ జరగనుంది. దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నవారు హోలీ ఉత్సవాలకు సొంత గ్రామాలకు చేరుకుంటారు. అలాంటి వారి కోసం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. హోలీ ఉత్సవాలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచింది. సికింద్రాబాద్‌ నుంచి రక్సౌల్‌, కాచిగూడ నుంచి బికనేర్‌ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు వెల్లడిరచారు.మార్చి 4న సికింద్రాబాద్‌ నుంచి రక్సౌల్‌ (07051), మార్చి 9న రక్సౌల్‌ నుంచి సికింద్రాబాద్‌ (07052) మధ్య ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడిరచింది. మార్చి 4న కాచిగూడ నుంచి బికనేర్‌ (07053), మార్చి 7న బికనేర్‌ నుంచి కాచిగూడ (07054) మధ్య ఎక్స్‌ప్రైస్‌ ట్రైన్లు నడపనున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రైస్‌ ట్రైన్లలో ఏసీ 2 టైర్‌, ఏసీ 3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌తో పాటు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడిరచారు.
మరో వందే భారత్‌ రైలు..
సికింద్రాబాద్‌ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌- విశాఖ మధ్య వందేభారత్‌ ట్రైన్‌ నడస్తుండగా… తాజాగా.. సికింద్రాబాద్‌ – పుణె మధ్య మరో ట్రైన్‌ నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ స్థానంలో ఈ వందే భారత్‌ ట్రైన్‌ నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఏప్రిల్‌ నుంచి కొత్త రేక్స్‌?తో సికింద్రాబాద్‌- పుణె మార్గంలో కొత్త వందే భారత్‌ రైలు పలుగులు పెట్టనున్నట్లు సమాచారరం. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో రీప్లేస్‌ చేసే ఆలోచనలో భారతీయ రైల్వేస్‌ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సికింద్రాబాద్‌ – పుణె మధ్య ట్రైన్‌ నడపనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 10 వందే భారత్‌ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య నడుస్తున్నాయి. దిల్లీ-కాట్రా, దిల్లీ-వారణాసి, దిల్లీ- అంబ్‌ అందౌర, బిలాస్‌పూర్‌- నాగ్‌పూర్‌, గాంధీనగర్‌-ముంబై, ముంబై-షిరిడీ, ముంబై సోలాపూర్‌ సెంట్రల్‌, చెన్నై-మైసూరు, హౌరా-న్యూజల్పగురి జంక్షన్‌, సికింద్రాబాద్‌ – విశాఖపట్నం రూట్లలో ఈ టైన్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వందే భారత్‌ ట్రైన్లకు ప్రయాణికల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో ప్రయాణించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img