Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి : కేటీఆర్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ప్రగతి భవన్‌ నుంచి మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరద పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాణనష్టం జరుగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని, వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలని సూచించారు. పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img