Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సిరిసిల్ల షాలినీ కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో షాలినీ అనే యువతిని గుర్తు తెలియని దుండగులు ఇవాళ తెల్లవారుజామున కారులో వచ్చి యువతి తండ్రిని తోసేసి అమ్మాయిని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే షాలినీ తననెవరూ కిడ్నాప్‌ చేయలేదని ఇష్టపూర్వకంగానే జానీతో వచ్చేశానని షాలినీ వీడియోను విడుదల చేసింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వచ్చానని, జానీ, తాను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని పేర్కొంది. మా తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్లమని తానే ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిపింది. తీసుఉకెళ్లే ముందు తాను ప్రేమించిన వ్యక్తిని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని తెలిపింది. గుర్తుపట్టాక ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణభయం ఉందని తెలిపింది.యువకుడితో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలు రిలీజ్‌ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. మరో వైపు జానీ అనే యువకుడే తన బిడ్డను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడంటూ యువతి తల్లి కన్నీరు మున్నీరయ్యింది. తన బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ప్రాధేయపడిరది. తనను కొట్టి యువతిని బలవంతంగా లాక్కెళ్లారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తమ బిడ్డను కాపాడాలని వేడుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img