నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి 120 ఐసీయూ బెడ్స్ సాయం
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ తన ఫౌండేషన్ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్గా ప్రారంభించాడు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యువరాజ్ సింగ్ కి హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ధన్యవాదాలు తెలిపారు. పేదల కోసం ఫౌండేషన్ చేస్తున్న సేవలను తెలంగాణ ప్రభుత్వం తరుపున అభినందించారు.యువరాజ్ సింగ్ తన గొప్ప మనసును చాటుకున్నారుని మంత్రి మహమూద్అలీ ప్రశంసించారు.