Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

కేసీఆర్‌ను చూస్తే ఆయన మళ్లీ పుట్టాడనిపిస్తోంది: సీఎం రేవంత్

తెలంగాణ మాజీ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్‌పై సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత అంటూ కె. చంద్రశేఖర్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే తప్పుడు ప్రచారం చేయటంలో దిట్ట అయిన గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయటం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయటం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని సీఎం రేవంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img