Friday, May 3, 2024
Friday, May 3, 2024

తెలంగాణలో మోగిన బడి గంట..

వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం తెరుచుకొన్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాటపట్టనున్నారు. ఇన్నాళ్లు సెలవుల మజాను ఆస్వాదించి.. ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా సోమవారం నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది. నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (సైట్‌)లకు అధికారులు వేర్వేరు ప్రణాళికలను రూపొందించారు. వాటిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించి ఆమోదం తీసుకున్నారు. నిరుడు 1-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img