రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జహీరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మారెడ్డి మృతదేహం రైలుపట్టాలపై గుర్తించారు.. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటన స్థలానికి చేరుకున్న వికారాబాద్ పోలీసులు మృతదేహం లక్ష్మారెడ్డిది గా గుర్తించారు.. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.