Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గిరిజన జాతరపై బీజేపీకి చిన్నచూపు ఎందుకు? : ఎర్రబెల్లి

అన్ని గుడులు, దేవాలయాలు తిరిగే ప్రధాని నరేంద్ర మోదీ మేడారం ఎందుకు రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. గిరిజన జాతరపై ఎందుకు చిన్నచూపని ఎర్రబెల్లి నిలదీశారు. కుంభమేళాకు కోట్లాది రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం… మేడారం జాతరకు 2కోట్లు ఇస్తుందా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మం అని చెప్పే బీజేపీకి మేడారం అభివృద్ధి పట్టదా? అని నిలదీశారు. కుంభమేళాకు కోట్లాది రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం… మేడారం జాతరకు 2కోట్లు ఇస్తుందా? అని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిచ్చోడా, మంచోడా?..సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా..? అని మండిపడ్డారు. మత చిచ్చులు పెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img