జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.వారిలో ఒకరు ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య..మరొకరు సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామస్వామి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.