జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిట సమావేశం నేపథ్యంలో ఈఎన్సీ లేఖ రాశారు.గోదావరి-కావేరిఅనుసంధానంపై అభిప్రాయాన్ని తెలంగాణ ఇప్పటికే చెప్పిందని ఈఎన్సీ తన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ కూడా నీటిని వాడుతోందని తెలిపారు. ఛత్తీస్గఢ్ లేకుండా సమావేశం భావ్యం కాదని సూచించారు. ఎన్డబ్ల్యూడీఏ సమావేశానికి ఛత్తీస్గఢ్ను కూడా పిలవాలని సూచించారు.