Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టెన్త్‌ క్లాసులో ఈసారి ఆరు పరీక్షలే

విద్యాశాఖ ఉత్తర్వులు
తెలంగాణ పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు.వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img