Friday, May 3, 2024
Friday, May 3, 2024

తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్‌ పాదయాత్ర..

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నాలుగో రోజు విజయవంతంగా కొనసాగుతున్నది. ఆయనతోపాటు కాంగ్రెస్‌ జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ధర్మపురిలో పాదయాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో రాహుల్‌ గాంధీతో సినీ నటి పూనం కౌర్‌ కూడా పాల్గొన్నారు. అనంతరంలో ఉస్మానియా విద్యార్థులతో రాహుల్‌ గాంధీ కలిసి పలు సమస్యలపై ముచ్చటించారు. విద్యార్థులు రాహుల్‌ తో కలిసి నడిచారు. ఈ సాయంత్రం జడ్చెర్లలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న రాత్రి ఆయన ధర్మాపూర్‌ లో బస చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img