Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దేశానికి దిశ, దశ చూపిన మహనీయులు అంబేద్కర్.. మంత్రి సబితారెడ్డి

దేశానికి దిశ, దశ చూపిన మహనీయులు బాబా సాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని, అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బీ ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఆమె పార్టీ నేతలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ మహనీయుని పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడమే కాకుండా, 125 అడుగుల అతి ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుందని మంత్రి పేర్కొన్నారు. అందరూ చదువుకుంటేనే సమాజంలో సమానత్వం వస్తుందని, ఆ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చన, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలను సుభాష్ రెడ్డి, ఇంద్రపాల్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, చిత్తారి, ప్రభాకర్ రెడ్డి, శివ ముదిరాజ్, అంబేద్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img