తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల పెండిరగ్ చలాన్ల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. పెండిరగ్ చలాన్ల ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 135 కోట్లు జమ అయ్యాయి. రాష్ట్రంలో 6 కోట్ల పెండిరగ్ చలాన్లకు చెల్లించాల్సిన మొత్తం రూ. 1,750 కోట్లు. అయితే రూ. 500 కోట్ల వరకు జమ కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి నెలఖారు వరకు రాయితీపై చలాన్ల రుసుం చెల్లించే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.