Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రాష్ట్రంలో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నెల 19, 20 తేదీల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సాధారణంగా మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చిలోనే వీస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img