పార్టీ నేతలతో కేటీఆర్
మంత్రి కేటీఆర్ తెలంగాణభవన్లో ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల వారీగా నేతలతో కేటీఆర్ భేటీ అవుతున్నారు.దుబ్బాక, సిరిసిల్ల, సంగారెడ్డి నియోజక వర్గాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. విజయగర్జన సభకు భారీగా జనసమీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అందరూ కలిసి పనిచేయాలని, ఇక నుంచి తానే అందరికీ అందుబాటులో ఉంటానని సమస్యలుంటే నేరుగా వచ్చి తనను కలువొచ్చని కేటీఆర్ తెలిపారు.