ఈ నెల 19న ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు బయల్దేరనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి పున: ప్రారంభ తేదీ ముహుర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించి వున్నారు. యాదాద్రిలోనే ఆలయ పున:ప్రారంభ తేదీలను సీఎం ప్రకటించనున్నారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.