సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయాధికారులపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు అధికారులను పంటల సాగు వివరాలను అడిగారు. దీంతో అధికారులు తడబడ్డారు. దీంతో తడబడ్డ ఏడీఏపై మంత్రి ఆగ్రహించారు. వివరాలు తెలుసుకోకుండా వస్తారా మంత్రి ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. జహీరాబాద్ ఏడీఏ, మన్నాపూర్ ఏఈఓ తీరుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ను ఆదేశించారు.‘‘ఉద్యోగ నిమిత్తం టూరిస్ట్ లేదా విజిట్ విసాల ద్వారా ప్రయాణానికి ముందు ఉద్యోగవకాశం కల్పించే సంస్థలు నిజమైనవా? కాదా? అని అక్కడ భారత దౌత్య కార్యాలయాల ద్వారా తెలుసుకోవాలి.. రిక్రూట్ చేసుకునే ఏజెంట్ల గత చరిత్రలను కూడా పరిశీలించాలి’’ అని పేర్కొంది. అంతకుముందు మయన్మార్లోని భారత రాయబార కార్యాలయం కూడా అడ్వైజరీ విడుదల చేసింది. మయన్మార్ మారుమూల తూర్పు సరిహద్దు ప్రాంతాలలో ఉన్న డిజిటల్ స్కామింగ్ కార్యకలాపాలలో నిమగ్నమైన కంపెనీల గురించి హెచ్చరించింది.