Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుకగా తీపి కబురు ప్రకటించారు. అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్‌ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను.. సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాలి అని అదేశించారు. ఈ మేరకు సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img