Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సికింద్రాబాద్‌ పాప కిడ్నాప్‌ కథ సుఖాంతం

సికింద్రాబాద్‌లో ఆరేళ్ల పాప కిడ్నాప్‌ ఉదంతం చివరకు సుఖాంతం అయింది. పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఐదు గంటల్లోనే పాప ఆచూకీని కనిపెట్టారు. పాపను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పాపను అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.చిలకలగూడలో ఉండే నర్సింగ్‌, రేణుక దంపతులు సికింద్రాబాద్‌ లోని ఓ ఎలక్ట్రానిక్‌ షాపులో పనిచేస్తున్నారు. ఈ దంపతుల కూతురు కృతిక స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం జనరల్‌ బజార్‌ లోని తన తల్లి ఇంట్లో కూతురును వదిలి రేణుక డ్యూటీకి వెళ్లింది. ఇంటిముందు ఆడుకుంటూ ఉన్న కృతిక కాసేపటికి కనిపించకుండా పోయింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రేణుక, నర్సింగ్‌.. కూతురు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సిద్ధిపేట బస్‌ ఎక్కినట్లు బయటపడిరది. చివరకు ధూళిమిట్టలో కృతికతో పాటు కిడ్నాపర్‌ ను గుర్తించి, ఆమెను కాపాడారు. కిడ్నాపర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img