Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

మణికొండ జాగీర్‌ భూములు ప్రభుత్వానివేనని తీర్పు
రూ.వేల కోట్ల విలువైన 1654 ఎకరాలు సొంతం

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. హైటెక్‌ సిటీ సమీపంలోని మణికొండ ల్యాంకోహిల్స్‌ నిర్మాణ భూములపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రూ.వేల కోట్ల విలువైన 1654 ఎకరాలు భూములపై ప్రభుత్వానికి హక్కు దక్కింది. మణికొండ జాగీర్‌ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డు మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ అంశం 2016లో సుప్రీంకోర్టుకు చేరగా.. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ భూములపై పూర్తిహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని సోమవారం తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img