హోంమంత్రి మహమూద్ అలీ
సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన పోలీస్ స్టేషన్ స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నేరాల అదుపునకు పిడి ఆక్ట్ను ప్రయోగిస్తామని తెలిపారు. షాద్ నగర్లో శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వాటర్స్ను పరిశీలించి కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు.