మోత్కుపల్లి నర్సింహులు
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధును అడ్డుకున్నా.. ఇంకెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. దళితబంధును అడ్డుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను అడుగడుగునా అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.దళితబంధు కొత్త పథకం కాదు. దళితబంధును ఏడాది క్రితమే అమలైంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రను హుజూరాబాద్ ప్రజలు గమనించాలి అని చెప్పారు. ఎన్నికల పేరుతో దళితబంధును కేంద్రం నిలిపివేయడం సరైంది కాదు. దళితబందు అనేది కొనసాగింపు పథకమని అన్నారు.