Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ : ఎంపీ నామా

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌, వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్‌, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్‌ అని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో తమ రాష్టానికి ఏముంటుందని అందరూ ఎదురుచూస్తుంటారన్నారు. అమృత్‌ కాల్‌ బడ్జెట్‌ అని వచ్చే 25 ఏళ్ళకి అంటున్నారని, కానీ ఈరోజు చస్తున్నామని అని మండిపడ్డారు. ప్రభుత్వ రంగాలను చంపేస్తున్నారని, అమ్మే అన్ని సంస్థలను లైన్‌లో పెట్టారని అన్నారు. బడ్జెట్‌ విధానంపై అంశంలో గ్రామస్థాయిలో కూడా చర్చ జరగాలన్నారు. కనీసం రైతులకు కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాలో కూడా వ్యవసాయం బాగుంది కాబట్టే మనకు ఆదాయం ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img