Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోదీ ఇప్పటికీ గతం గురించే తవ్వుతుంటారు : ప్రియాంక గాంధీ

మోదీ ఏడేండ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు..అయినా ఆయన ఇప్పటికీ గతం గురించి తవ్వుతుంటారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. అసలు ఆయన భవిష్యత్‌ గురించి ఎందుకు మాట్లాడరని విస్మయం వ్యక్తం చేశారు. యూపీలో తొలి దశ పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో ప్రియాంక గాంధీ బుధవారం ఓ వార్తాఛానెల్‌తో మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూలపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం గతంలోనే ఎందుకు మగ్గుతుంటారని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రధాని గతంలోనే ఉన్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ తన ఏడేండ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని, కాంగ్రెస్‌ హయాంలో ఎంతమంది దారిద్య్ర రేఖ ఎగువకు వచ్చారనే దానిపైనా చెప్పాలని అన్నారు.దేశ స్వాతంత్య్రం కోసం, అభివృద్ధి కోసం నెహ్రూ ఏం చేశారనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని..మీరు చరిత్రను చెరిపేయాలంటే అలాగే చేయండి..కానీ సత్యం బయటకు వస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img