పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.4 కోట్లకు పైగా నగదు పట్టుబడిరది.విజయనగరం నుంచి గుంటూరుకు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్కు చెందిన బస్సులో ఈ నగదును గుర్తించారు. రూ.4.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.