జనాభా ప్రాతిపాదకిన కేంద్రం నిధులు నష్ట పోతున్నాం
సిఎం కి లేఖ రాసిన ఆచార్య కె యస్.చలం
అమరావతి లో ఒక ప్రభుత్వ కార్యక్రమం లో దక్షిణాది రాష్ట్రాల జనాభా గూర్చి మాట్లాడుతూ ఆంధ్రులు తమ జనాభా సంఖ్యను పెంచుకోవాలని చెప్పటం ఒక దార్శినికునికి వున్న ముందు చూపును సూచిస్తుందని యుపిఎస్సి మాజీ సభ్యులు ఆచార్య కె యస్ .చలం తెలిపారు . ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబునాయుడు కి లేఖ రాశారు. ఒక ఆర్ధికశాస్త్ర ఆచార్యునిగా, పరిశోధకుని గా ఈ విషయమై ఎప్పుడో నేను రాశాను అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యం గా ఫైనాన్స్ కమిషన్ కేటాయింపుల్లో మనం జనాభా ప్రాతిపదికన నష్ట పోతాం అని మీరు గ్రహించి చర్యలు తీసుకోవటం మాకు ఆనందం కలుగ జేసింది. యిదే సందర్భం లో మన తెలుగు జాతి చరిత్ర సంస్కృతిపై కూడా మీరు దృష్టి పెట్టగలరని భావిస్తూ ఈ క్రింది విషయం మీ అవగాహన కొరకు యిస్తున్నాము. తెలుగు జాతి చరిత్రలో విశాఖపట్నం కు ముఖ్యంగా నాటి త్రికలింగలో భాగ మయిన మద్రాసు రాష్ట్ర ములోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు (గంజాం) తెలుగువారి కి గొప్ప ఆభరణాలు. ఈప్రాంత చరిత్రలో క్రీ. పూ. బౌద్ధ, జైన మతాలు అమరావతి కంటే ముందునుండి వున్నాయి. ముఖ్యంగా విశాఖలోని బావికొండ, తోట్ల కొండ, పావురాళ్ళ కొండ తో బాటు పవిత్రమయిన ఋషి కొండ
వుంది. ఋషి కొండ ను ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యం గా విశాఖవాసులు చాలా భక్తి గౌరవాలతో చూస్తారు. బహుశా అక్కడ బౌద్ధ, జైన ఋషుల కు అది ఆలవాలమై వుంటుంది అందుకే మాకు
సెంటిమెంట్ . దానిని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాము. గతం లో అక్కడ టూరిజమ్ వారి బిల్డింగ్ లను మార్చి నూతన కట్టడాలు వచ్చాయి. వాటిని ప్రజల పరము చేసి తెలుగు జాతి గొప్పతనాన్ని
యినుమడించే లాగా, మీ ప్రభుత్వం ను ప్రజలు గుర్తించే విధం గా చేయాలని మా విన్నపం.
అందుకు గాను ఆ కట్టడాలను మన రాష్ట్ర మ్యూజియం గా వినియోగించాలని కోరుతున్నాము.
విశాఖలో వున్న ప్రస్తుత
చిన్న మ్యూజియం నేవీ కి చెందినది. మనకు రాష్ట్ర మ్యూజియం లేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత
మనకు రావలసిన శిల్ప, కళా ఖండాలు, విశాఖ లో దొరికిన బుద్ధుని అవశేషాలు (ఇప్పటికీ హైదరాబాద్ లో వున్నవి) యిక్కడకు తీసుకు రావలసి వుంది. ఈ వివరాలతో ఒక పరిశోధకుని వ్యాసం జత
చేస్తున్నాను. యిది అంతర్జాతీయం గా జపాన్, వియెట్నం, చైనా థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాలకు దర్శనీయ స్థలం అవుతుంది. యిప్పుడు పాట్నాలో వున్న బుద్ధుని అవశేషాలు దర్శించటానికి వెళుతున్న పర్యాటకులు విశాఖ వస్తారు. మ్యూజియం కు సరిపడా గదులు అక్కడ వున్నాయి. నిజానికి యిది ఈస్ట్ కోస్ట్ లేక తూర్పు తీర మ్యూజియం గా కూడా ప్రకటించి కేంద్ర
ప్రభుత్వం దీనికి నిధులు యిచ్చేలా చేయ వచ్చు. మన తెలుగు ప్రజలే గతంలో తూర్పు తీరం అంతా వుండేవారు . యిప్పుడు కూడా పూరీ నుండి రామేశ్వరం వరకు మత్స్య కారులు తెలుగు
మాట్లాడతారు. ఆ విధం గా తెలుగుదేశం తెలుగు జాతికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి నట్లు
అవుతుంది. మిగతా గదులు వుంటే అంతర్ జాతీయ సెమినార్లు, పరిశోధకులకు కావలసిన సౌకర్యాలు కల్పించి దానిని ప్రభుత్వ-ప్రజల ఒక ఉన్నత స్తాయి సంస్థ గా రూపిందించాలని విజ్ఞప్తి
చేస్తున్నామని సిఎం కి రాసిన లేఖలో పేర్కొన్నారు.