జిల్లా ఖజనా కార్యాలయం పరిధిలోని డిడిఓలు హాజరు కావాలి
ఉద్యోగుల ఎపిజిఎల్ఒ ధృవీకరణ పాలసీ బాండులు పొందాలి
జిల్లా ఖజనా లెక్కల అధికారి శ్రీ ఆర్.ఎ.ఎస్.కుమార్
విశాలాంధ్ర విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత భీమ శాఖ డిజిటల్ సేవలపై సొమవారం నాడు జిల్లా ఖజనా కార్యాలయం పరిధిలోని డిడిఓలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖజనా మరియు లెక్కల అధికారి శ్రీ ఆర్.ఎ.ఎస్.కుమార్ మరియు ఎపిజిఎల్ఒ శాఖ సహాయ సంచాలకులు శ్రిమతి జి.హైమవతి ఒక ప్రకటలో తెలిపారు. జిల్లా ఖజనా కార్యాలయం పరిధిలోని డిడిఒలందరు సొమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమగ్ర ఫైనాన్సు కాంప్లెక్సులోని జిల్లా లెక్కల మరియు ఖజనా కార్యాలయంనకు హాజరు కావాలని కోరారు. డిడిఒల సిబ్బంది యొక్క యొక్క ధృవీకరణ పాలసి వివరాలు ఎపిజిఎల్ఐ బాండ్లు సంబంధిత ఉప ఖజనా అధికారుల ద్వారా పొందవలయునని తెలిపారు.