Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

భావితరాలకు సాహిత్యం మార్గదర్శకంగా నిలుస్తుంది

ఆర్ వి ఎస్ రాజు (పశ్చిమగోదావరి జిల్లా) : విశాలాంధ్ర – గణపవరం: భావితరాలకు సాహిత్యం మార్గదర్శకంగా నిలుస్తుందని కళలు కళాకారులను ప్రోత్సహించడమే రుద్రరాజు ఫౌండేషన్ పద్మినిపురం కళా పీఠం ధ్యేయమని రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్, శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ అధ్యక్షులు రుద్దరాజు వేంకట సూర్యనారాయణ రాజు (ఆర్ వి ఎస్ రాజు) అన్నారు. గణపవరం శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకలలో భాగంగా కాళ్ళకూరి సుబ్బారావు 14వ స్మారక సాహిత్య పురస్కారాలు వర్తక సంఘం వారి సౌజన్యంతో రాజమండ్రికి చెందిన డాక్టర్ పులపర్తి శ్రీనివాసరావుకి పద్మినీపుర కళా పీఠం సాహితీ పుష్కరాలను ఆర్ వి ఎస్ రాజు అన్నపూర్ణమ్మ దంపతులు సౌజన్యంతో పులపర్తి శ్రీనివాస్ వేదగిరి రాంబాబు స్మారక కళా పుష్కారమును లంక నాగ శశికళ ఆకివీడు వారికి ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి పంపన సాయిబాబా ఈ వి సత్యనారాయణ యండపల్లి పాండురంగారావు సంఘం సెక్రెటరీ నడిపిల్లి రాంపండు జాయింట్ సెక్రెటరీ కవులు, కళాకారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img