జనసేన ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి
విశాలాంధ్ర- అనందపురం :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ఆదేశాలతో ఎన్డీఏ కూటమి తోనే మా ప్రయాణం సాగుతుందని ఆనందపురం మండలం జనసేన ప్రధాన కార్యదర్శి మూర్తి వివరణ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించామని కానీ భీమిలి అసెంబ్లీ టికెట్ విషయానికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో సందీప్ కు రావలసిన టికెట్ వేరే వ్యక్తికి రావడం కొంచెం ఇబ్బంది కలిగించిందని అయినా కూడా అధినేత ఆదేశాలతో ఎన్డీఏ కూటమితో పార్టీ విజయానికి సందీప్ నాయకత్వంలో కష్టపడి పని చేస్తామని అలాగే పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించవలసిందిగా ఇన్చార్జికి తెలియజేశారు.