Friday, April 26, 2024
Friday, April 26, 2024

గొట్లాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

విశాలాంధ్ర – బొండపల్లి : ఈరోజు గజపతినగరం నియోజకవర్గం గొట్లాంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన జరిగిన గజపతినగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి , రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ , జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) .ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలికలు మరియు శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ , శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్సవ సురేష్ బాబు, గజపతినగరం నియోజకవర్గ లోగల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img