విశాలాంధ్ర – విజయనగరం : జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల హక్కులు మరియు పరిరక్షణ కోసం రూపొందించబడిన గోడ పత్రికను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వారి కార్యాలయంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కె.వి సూర్యనారాయణ రాజు (పులి రాజు)మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు..