Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పార్వతీపురం టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాతని, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. అంబేద్కర్ సమాజానికి దిశా నిర్దేశం చేశారని,అంబేద్కర్ ఆశయసాధనకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యమంలో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్, నియోజక వర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు,పట్టణ అధ్యక్షుడు గుంట్రెడ్డి రవికుమార్,పార్వతీపురం అద్యక్షుడు దొగ్గ మోహన్, సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, పట్టణ కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరితమధుసూధనరావు, పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, గర్భాపు ఉదయభాను, కోలాబాబు,బోను దేవీచంద్రమౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్  తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కృష్ణపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు,నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img