Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజావ్యతిరేక,నిరంకుశ,మతోన్మాద బిజేపి ని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.నాగభూషణం

వాడ వాడ లా సీపీఐ -సీపీఎం ప్రచారభేరి
విశాలాంధ్ర- రాజాం : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.ప్రతీ పౌరుడు గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాలని,ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బీజేపీని సాగనంపాలని దేశాన్ని కాపాడుకుందాంమని సీపీఎం – సీపీఐ జిల్లా నాయకులు కె. సురేష్, ఎన్ నాగభూషణం రేగిడి మండలం లో సీపీఐ -సీపీఎం నాయకులు ప్రచార భేరి ఆటో జాత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ -అమిత్ షాల నాయకత్వంలో బిజెపి -ఆర్ ఎస్ ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజలమద్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నదన్నారు.మరోవైపు ఆదానీ -అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు.ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ నిరంకుశంగా అణచివేస్తున్నదన్నారు . దేశంలోని అడవులను భూములను విద్యుత్తు ప్రాజెక్టులను గనులను కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతోందన్నారు.అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి,ప్రజలపై మోయలేని భారాలుమోపుతున్నదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని దౌర్భాగ్య స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం పోయిందన్నారు.ఇటువంటి పరిస్తితుల్లో దేశంలో రాష్ట్రంలో అలుముకుంటున్న చీకట్లనుండి బైటపడటానికి ప్రజానీకమే ఉవ్వెత్తున కదిలి ఉద్యమించాలని అటువంటి మహోద్యమం నిర్మించడానికి వామపక్ష పార్టీలైన సీపిఐ -సీసీఎం ముందుకొస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ సీపీఎం నాయకులు పి. విశ్వనాథం, ఎం, త్రినాథ్, వి. తిరుపతి రావు సుమన్, రమేష్ తదతరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img