Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మూడోరోజున జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

విశాలాంధ్ర,పార్వతీపురం : పదోతరగతి పరీక్షలు మూడోరోజు శనివారంనాడు జరిగిన హిందీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు ఎస్ డి పి రమణ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 64కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. 10,508 మంది విద్యార్థులకు గాను 10,478 మంది హాజరు కాగా,30 మంది పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లాల్లోని తాను ఆరు పరీక్షా కేంద్రాలను, డి ఎల్ ఓ నాలుగు పరీక్షా కేంద్రాలను, స్క్వాడ్లు 18పరీక్షా కేంద్రాలను తనిఖీలు నిర్వహించామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ ఉత్తర్వుల కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తూచ తప్పకుండా పాటించడం జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img