Monday, May 20, 2024
Monday, May 20, 2024

కోండ్రు మురళి మోహన్ ఆధ్వర్యంలో రాజాంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం

విజయనగరం జిల్లా. రాజాం : మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ శుక్రవారం నాడు రాజాం తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి తెదేపా జెండాను ఆవిష్కరించి నాయకులతో కలిసి కేక్ ను కట్ చేసారు.అనంతరం .కోండ్రు మురళీ మోహన్ మాట్లాడుతూ కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు. తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు.నేటికీ సామాజిక న్యాయం నూరుశాతం అమలవుతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అంటే అతిశయోక్తి కాదన్నారు,తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, పేద, బడుగు, బలహీన వర్గాలలో జీవనరేఖలు వికసింప చేయటం వంటి అంశాలు రాష్ట్ర చరిత్రలో టిడిపికి చెరగని ముద్ర వేశాయన్నారు.టిడిపికి చంద్రబాబు వంటి నాయకుడు తరగని ఆస్తి. చంద్రబాబు నాయకత్వంలో సుశిక్షితుడైన సైనికుని తరహాలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులలో పోరాట స్ఫూర్తి నింపుతున్నారన్నారు.తెలుగుజాతి ఔన్నత్యానికి స్వర్గీయ ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img