Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చలివేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర-విజయనగరం రూరల్ : శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవాసంఘం కంటోన్మెంట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. మంగళవారం స్థానిక ఆర్.అండ్.బి.జంక్షన్ బస్టాప్ వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ముమ్మిడిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వేసవితాపం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. తలకు టోపీ ధరించాలని, నిమ్మరసం,మంచినీరు,పళ్ళ రసాలుకొబ్బరి నీళ్లు తరచు తాగడం వలన దాహార్తి తగ్గుతుందన్నారు. 2024-25 అధ్యక్షుడు తవ్వా మోహనరావు మాట్లాడుతూ బాటసారులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటినుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చలివేంద్రం 60 రోజులపాటు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి త్రినాధ్, కొల్లా సాయిరాజు, వడ్డాది ఈశ్వరరావు, ఉప్పల కాశి, కె.వి.శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img