Friday, May 3, 2024
Friday, May 3, 2024

పెదంకలంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని పెదంకలం గ్రామంలో బూర్జ ఆయుర్వేద వైద్యులు తెర్లి హేమాక్షి ఆద్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరంను నిర్వహించారు. గ్రామంలో శ్వాసకోసవ్యాదులు, వాత వ్యాధులు,అజీర్ణం, జీర్ణ ప్రక్రియతో బాధ పడే వారికి తనిఖీలు నిర్వహించారు.106మందికి తనిఖీలు నిర్వహించి ఆయుర్వేద మందులు అందజేసినట్లు తెలిపారు. వేసవితాపాన్ని తట్టుకునేందుకు చిట్కాలు పాటించండని తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గూర్చి అవగాహణ కల్పించారు. దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కోసం ఆయుర్వేద మందులు ఉపయోగాన్ని వివరించారు. ఇటీవల కాలంలో ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం, వాటిద్వారా జరుగుతున్న ఉపయోగాలను వివరించారు. ప్రతీ ఒక్కరూ నేటి వాతావరణ మార్పులు వల్ల తీసుకోవాల్సిన జాగ్రతలు గూర్చి అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములునాయుడు,సర్పంచ్ బలగ శ్రీనివాసరావు, గ్రామపెద్దలు, ఆయుర్వేద వైద్య సిబ్బంది పద్మ,రూప, నాగరాజులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img