విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రం లోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలోగల శ్రీలక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో ప్రతీ గురువారం ముడుపుల పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా చేస్తున్నారు.శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున నాలుగున్నరగంటల నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు పూజలను నిర్వహిస్తారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలో జరుగుతున్నముడుపుల
పూజలకు అనూహ్య స్పందనతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు,మహిళలూ,పురుషులు, యువతీ యువకులు సైతం పెద్ద ఎత్తున ముడుపులు కట్టి ఉపవాసదీక్షను పాటిస్తూ పూజలు చేస్తున్నారు. అందరికీ శుభం కలుగుతుందని పలువురు భక్తులు తెలిపారు. ఉదయంనుంచి సాయంత్రం వరకు బ్యాచులవారీగా పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. వారం వారం భక్తుల రద్దీి ఘననీయంగా పెరుగుతుంది.