Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

ఘనంగా నివాళులర్పించిన జెడ్‌పి ఛైర్మన్‌ శ్రీనివాసరావు
విశాలాంధ్ర – విజయనగరం : అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు జాతి కోసం, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అప్పటివరకు మద్రాసీలుగా పిలవబడ్డ తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని, తద్వారా తెలుగు జాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని పొట్టి శ్రీరాములు సముపార్జించారని అన్నారు. సుమారు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి, మొక్కవోని పోరాటపటిమతో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆయన దీక్షలోనే తన అమూల్యమైన ప్రాణాలను విడిచిపెట్టినప్పటికీ, తెలుగుజాతి ఉన్నంతవరకు ఆయన ఖ్యాతి నిలిచిఉంటుందని ఛైర్మన్‌ శ్రీనివాసరావు అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి నిర్మలాదేవి, జెడ్‌పి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img