Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సీతానగరం ప్రముఖులు సాలాహరి తల్లి మృతికి సంతాపం వ్యక్తంచేసిన అధికార, ప్రతిపక్ష ప్రముఖులు

విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంకు చెందిన పురప్రముఖులు సాలా హరి గోపాల్ తల్లి సాలా నారాయణమ్మ (94) శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతి చెందారన్న సమాచారం తెలిసిన వెంటనే బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్, టిడిపి నియోజకర్గ ఇంచార్జి బేబీనాయన విచ్చేసి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.శనివారం ఉదయం ఎమ్మెల్యే అలజింగి జోగారావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమని, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి చిరంజీవులు,టీడీపి నియోజక వర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు , బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ తూముల అచ్యుతవల్లి, గర్భాపు ఉదయభాను, వాడాడ రాములు విచ్చేసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితోపాటు దామినేని భానుప్రసాద్ , చెలికాని వెంకట గోపాలకృష్ణ,వైఎ్సార్సీపీ పార్టీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిపి బలగ శ్రీరాములునాయుడు, టీడీపి అద్యక్షుడు కొల్లి తిరుపతిరావు, కార్యదర్శి రౌతు వేణు గోపాలనాయుడు, మాజీ ఎంపీపీలు బొన్నాడ శ్రీరాములు నాయుడు, కొట్నాన రత్నాకరరావు, శనపతి ప్రసాద్ పాత్రుడు, తెంటు వెంకట అప్పలనాయుడు, ఆర్వీ పార్థసారథి, డాక్టరు దీనకుమార్, మమ్ముల విశ్వేశ్వరరావు,సత్యనారాయణ, శ్రీనివాసరావు, తేరేజమ్మగరికయ్య, ఇజ్జాడ. సింహాచలం, కిరణ్, సూర్యనారాయణ,బుడితి శ్రీను, సబ్బాన శ్రీను,పిన్నింటి రామారావు,మరిసి వెంకన్న,అప్పారావు, సాకేటి కూర్మారావు,మాధవతో పాటు మండలంలోని 35గ్రామ పంచాయతీలకు చెందిన ఇరు పక్షాల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మృతిచెందిన నారాయణమ్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు. బొబ్బిలి నుండి కూడా పలువురు విచ్చేసి పరామర్శ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img