Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన ఎల్.ఆర్ పేట మాంటిస్సోరి విద్యార్థులు…

విశాలాంధ్ర – పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలోని లజపతిరాయపేట మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో, 9వతరగతి చదువుతున్న విద్యార్థిని నాగరాజు, కీర్తి శ్రీ, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించగా, టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి మంతెన మోహిత్ వర్మ ద్వితీయ స్థానాలు సాధించడం జరిగిందని ఎస్ పి ఎస్ ప్రకాష్ రావు తెలియజేశారు. విద్యార్థులకు రెగ్యులర్ గా అందిస్తున్నటువంటి ఐఐటి ఫౌండేషన్, ఒలింపియాడ్స్ శిక్షణ ఇవ్వడం లాంటి అంశాల వల్ల, విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతి ఒలింపియాడ్ లోను ప్రతి సంవత్సరం విజేతలుగా నిలవడం జరుగుతోందని స్కూల్ అకడమిక్ డైరెక్టర్ కెవి కృష్ణ వర్మ అన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను మంగళవారం కృష్ణ వర్మ చేతుల మీదుగా ప్రత్యేకంగా జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img