Friday, April 26, 2024
Friday, April 26, 2024

వ్యవస్థలను నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్

ఏలూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర సోమవారం స్థానిక 27వ డివిజన్ చొదిమెళ్ళ కొనసాగింది. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వం పథకాల పేరుతో ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలు చైతన్యవంతులై జగన్ కి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు దర్శనమిస్తున్నాయని, ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చోదిమెళ్ళను ఏలూరు కార్పొరేషన్ లో విలీనం చేసారని అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేక పోయారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధి దర్శనం దొరకటమే కష్టతరంగా మారిందన్నారు. అభివృద్ధి జరగాలంటే మళ్ళీ టిడిపి ప్రభుత్వం రావాలని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీ స్థానిక నాయకులు కోనేరు వంశీ, యడ్లపల్లి శివసత్యనారాయణ, తాళం నాని, యడ్లపల్లి మహేష్, యడ్లపల్లి ప్రసాద్, యడ్ల ప్రసాద్, బెజవాడ వెంకన్న, చల్లారి శ్రీనివాసరావు, తాళం సాయి, రావూరి సత్తిరాజు, చేబ్రోలు సత్యనారాయణ, మొగళ్ల సూరిబాబు, తాళం ప్రసాద్, రెడ్డి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img